Saturday, April 27, 2024
More
    Homeక్రైమ్ న్యూస్ఇప్ప‌టి వ‌ర‌కు 300 మంది మ‌హిళ‌ల‌ను కొని అమ్మాడు

    ఇప్ప‌టి వ‌ర‌కు 300 మంది మ‌హిళ‌ల‌ను కొని అమ్మాడు

    చంద్ర‌రామ్ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బ‌రాబాంకి జిల్లాలో పేరు మోసిన వ్యాపారి. ఇత‌ను చేసే వ్యాపారం ఏంటంటే అమ్మాయిల‌ను కొన‌డం, అమ్మ‌డం. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న దాదాపు 300 మంది మ‌హిళ‌ల‌ను కొని అమ్మేసాడు. చాలా రోజుల వ‌ర‌కు అత‌ని దందా బాగా సాగింది. కానీ ఓ మామ త‌న కోడ‌ల‌ను 80 వేల రూపాయాల‌కు చంద్ర‌రామ్‌కు అమ్మేసాడు. ఇది తెలిసిన కోడ‌లి భ‌ర్త పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు స‌కాలంలో స్పందించ‌డంతో రైల్వే స్టేష‌న్లో అంద‌రూ ప‌ట్టుబ‌డ్డారు. ప‌ట్టుబ‌డిన 8 మందిలో ముగ్గురు మ‌హిళ‌లు కూడా ఉన్నారు. పోలీసుల విచార‌ణ‌లో చంద్ర‌రామ్ బండారం బ‌య‌ట‌ప‌డింది.

    Most Popular