సాధారంగా పేదలకు ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాలను గానీ, వ్యవసాయ భూములను గానీ కొనుగోలు చేయకూడదు. అయితే పదేళ్ల తర్వాత ఆ లబ్ధిదారునికి తీరని ఆర్ధిక సమస్యలు ఉంటే అతను అమ్ముకోవచ్చు. ఆ సందర్భంలో కొనుగోలు చేయవచ్చు. దీనికి జిల్లా కలెక్టర్, కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.